రైల్వేశాఖ హెల్ప్లైన్ నంబర్లు..

1 Feb, 2016 07:17 IST|Sakshi

విజయవాడ: తునిలో కాపుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో విజయవాడ- విశాఖపట్నం మధ్య నడిచే 15 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ రైల్వే కంట్రోల్ రూంలో డీఆర్ఎం అశోక్ కుమార్ పరిస్థతిపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. రైల్వే అధికారులు పలు స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు.

విజయవాడ(0866-2575038), తుని(08854-252172)లలో రైల్వే శాఖ హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా విశాఖపట్నం రైల్వే అధికారులు (0891-2744619, 2575183, 83003) హెల్ప్లైన్ నెంబర్లను తెలిపారు. ముందస్తుగా రిజర్వేషన్లు చేయించుకున్న ప్రయాణికులకు టికెట్ రుసుం తిరిగి చెల్లించనున్నట్లు డీఆర్ఎం అశోక్ కుమార్ తెలిపారు.

 

>
మరిన్ని వార్తలు