అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో శుక్రవారం 32 మండలాల్లో తేలికపాటి చిరుజల్లులు పడ్డాయి. ఉరవకొండ, సోమందేపల్లి, అమడగూరు, తనకల్లు, ఎన్పీ కుంట, కంబదూరు, శెట్టూరు, గుంతకల్లు తదితర మండలాల్లో తుంపర్లు కురిశాయి. సెప్టెంబర్లో 118.4 మి.మీ గానూ ప్రస్తుతానికి కేవలం 17.3 మి.మీ నమోదైంది.
కాగా రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షం కురిసే సూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్కుమార్రెడ్డి తెలిపారు.