ప్రాణం తీసిన వర్షం

26 Sep, 2016 01:09 IST|Sakshi
 
ఖిల్లాఘనపురం : ముసురు వర్షానికి ఇంటి గోడ కూలి ఒకరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అలాగే మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. పది రోజుజులుగా కురుస్తున్న ముసురు వానకు ఖిల్లాఘనపురం మండలం కమాలొద్దీన్‌పూర్‌లో రెండు ఇళ్లు కూలిపోయాయి. కాగా, ఈ గ్రామానికి చెందిన మాల మునమ్మ (65) ఆదివారం ఉదయాన్నే ఇంటి వద్ద కూర్చుని మొహం కడుగుతుండగా అక్కసారిగా పక్క గోడ కూలి మీద పడింది. దీంతో ఆమె అక్కyì కక్కడే మతి చెందింది.
 
అలాగే మరోచోట రేకుల ఇంటిపై కప్పు పడిపోవడంతో లోపల ఉన్న అంజిలమ్మ, ఎమ్మె పెద్ద రాంచంద్రయ్య దంపతులకు గాయాలయ్యాయి. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు.  
 
మరిన్ని వార్తలు