తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు

2 Oct, 2016 11:46 IST|Sakshi

విశాఖపట్నం: విదర్భ నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా... దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. అలాగే విదర్భ, ఛత్తీస్గఢ్, తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

>
మరిన్ని వార్తలు