రాగల 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు

31 Oct, 2015 09:58 IST|Sakshi

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావం బలంగా ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రాగల 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే కోస్తా తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. అయితే శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు