రైతు ప్రగతికి ‘ఆత్మ’ కృషి

18 Aug, 2016 20:32 IST|Sakshi

లోగో విడుదల చేసిన కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌
సంగారెడ్డి టౌన్‌: రైతు ప్రగతికి వ్యవసాయ సాంకేతిక యాజమన్యా సంస్థ (ఆత్మ) విభాగం కృష చేస్తోందని కలెక్టర్‌ రోనాల్డ్‌  రోస్‌ అన్నారు. గురువారం ఆత్మ విభాగానికి సంబంధించిన లోగోను ఆయన ఆవిష్కరించారు. రైతులకు నూతన శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ పాడి పంటల అభివృద్ధికి ఆత్మ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులు ఆత్మ కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు లోగోను ఉపయోగించాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు