వర్షాల కారణంగా ‘రైతు భరోసా యాత్ర’ వాయిదా

24 Sep, 2016 23:50 IST|Sakshi
– వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి వెల్లడి
 
కర్నూలు(ఓల్డ్‌సిటీ): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో ఈనెల 28 నుంచి నిర్వహించ తలపెట్టిన రైతు భరోసా యాత్ర వాయిదా పడినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో అధిక వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత భరోసా యాత్ర తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.
 
మరిన్ని వార్తలు