త్వరలో రాజగోపురాల కూల్చివేత

1 Aug, 2016 20:29 IST|Sakshi
త్వరలో రాజగోపురాల కూల్చివేత
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థాన విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ప్రధానాలయం రాజగోపురాలు, ఆలయ ఆవరణలోని మండపాలను కూల్చివేయనున్నట్లు వైటీడీఏ అధికారులు సోమవారం తెలిపారు. సుమారు 2.33 ఎకరాల్లో విస్తీర్ణం కానున్న  ప్రధానాలయానికి ఇటీవల వాస్తు  ప్రకారం అమ్మవారి ఆలయం, ఆళ్వార్ల ఆలయం, గోదాదేవి ఆలయం వంటివి ఎక్కడ నిర్మించాలో సర్వే చేశామన్నారు. ఈ క్రమంలో పాంచరాత్రాగమ శాస్త్రానుసారం పూజలు చేసిన అనంతరం ధ్వజస్తంభాన్ని తొలగించే ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సుదర్శన చక్రం ఉన్న రాజగోపురం కేవలం 12 ఫీట్లు మాత్రమే ఉందని, దీనిని సుమారు 52 అడుగుల ఎత్తు పెంచనున్నట్లు తెలిపారు. 
 
 
 
మరిన్ని వార్తలు