పెళ్లికి నిరాకరించిందని గొంతుకోశాడు..

16 Aug, 2015 13:39 IST|Sakshi

ఏటూరునాగారం(వరంగల్ జిల్లా): తనతో పెళ్లికి నిరాకరించిందని యువతి గొంతుకోశాడు. ఈ సంఘటన ఆదివారం వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం బుట్టాయిగూడెం గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన లక్ష్మీ(19) అనే యువతిని అదే గ్రామానికి చెందిన రాజాబాబు గత కొంత కాలం నుంచి పెళ్లి చేసుకోవాలని ఆమెను వేధిస్తున్నాడు. అయితే, అందుకు యువతి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన యువకుడు శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి యువతిని ఎత్తుకెళ్లాడు. పెళ్లికి నిరాకరిస్తావా అని బ్లేడ్ తో ఆమె గొంతు కోశాడు. దీంతో యువతి సృహ కోల్పోయింది. యువతి సృహా కోల్పోవడంతో చనిపోయిందని భావించిన యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.

యువతికి ఆదివారం ఉదయం సృహా రావడంతో తిరిగి గ్రామానికి చేరుకొని జరిగిన విషయం తెలిపింది. దీంతో గ్రామస్తులు యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువతి నుంచి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు. అయితే, యువతి గొంతు కోయడంతో మాట కోల్పోయింది. దీంతో జరిగిన సంఘటనా వివరాలను పేపర్‌పై రాసి పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, యువతికి తిరిగి మాట వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యలు తెలిపారు. దీంతో యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

మరిన్ని వార్తలు