పార్టీ బలోపేతానికి కృషి చేస్తా

23 Feb, 2017 23:46 IST|Sakshi
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
∙వైఎస్సార్‌ సీపీ గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షులు దుర్గేష్‌
మధురపూడి నుంచి భారీ కాన్వాయితో
ఘనస్వాగతం పలికిన అభిమానులు
దానవాయిపేట(రాజమహేంద్రవరం): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ నియోజవర్గాల్లో పటిష్ట కార్యవర్గాన్ని  ఏర్పాటు చేసి డివిజన్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆ పార్టీ గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షుడిగా నియామకం అనంతరం గురువారం నగరానికి వచ్చిన దుర్గేష్‌కు పార్టీ నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మధురపూడి విమానాశ్రయం నుంచి భారీ కాన్వాయి, మోటర్‌ సైకిళ్ల తో ర్యాలీగా ఆయన వెంట వచ్చారు. గాడాల, కోలమూరు, కొంతమూరు, క్వారీ సెంటర్‌ మీదుగా కంబాలచెరువు సెంటర్‌కు చేరుకుని మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువెళ్లి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో పటిష్ట కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెలావారీ సమావేశాలు నిర్వహించి ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం చేస్తామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టి పాలకుల వైపల్యాలను ప్రజల్లోకి తీసుకువెళతామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చేలా పని చేయడమే తన ధ్యేయమని ప్రకటించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గుత్తుల మురళీధర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రావిపాటి రామచంద్రరావు, నక్కా రాజబాబు, ఆచంట సుబ్బారాయుడు, ఆచంట కళ్యాణ్, గంటి నరసయ్య, సలాది ప్రసాద్, వెలుగుబంటి అచ్యుతరామయ్య, సాపిరెడ్డి సూరిబాబు, ముద్రగడ జమ్మి, యొజ్జు వాసు, చెరుకూరి సత్యనారాయణ, తాడేపల్లి గణేష్,  తోరాటి శ్రీను, మెండా దత్తులు, యండ్ల మహేష్, మార్తి లక్షీ్మనాగేశ్వరావు, సిటీ, రూరల్‌ నియోజక వర్గాల నేతలు ఆయన వెంట ర్యాలీగా Ðð ంట వచ్చారు. 
వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్ల అభినందనలు...
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షుడిగా ఎన్నికైన కందుల దుర్గేష్‌ను ఆ పార్టీ నగరపాలక సంస్థ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలా రెడ్డి, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, ఈతకోట  బాపన సుధారాణి, పిల్లి నిర్మల పార్టీ నాయకులు మజ్జి అప్పారావు, పెంకె సురేష్‌ గురువారం ఆయన నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు.   
 
మరిన్ని వార్తలు