రాజన్న శ్రావణమాసం ఆదాయం రూ. 4 కోట్లు

31 Aug, 2016 23:58 IST|Sakshi
రాజన్న శ్రావణమాసం ఆదాయం రూ. 4 కోట్లు
  • కొనసాగిన భక్తుల రద్దీ 
  • నేటితో ముగియనున్న శ్రావణమాసం 
  •  వేములవాడ : శ్రావణమాసం సందర్భంగా వేములవాడ రాజన్నకు రూ.4 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నెల రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దీంతో హుండీ ద్వారా మరింత ఆదాయం సమకూరే అవకాశముందని అధికారులు తెలిపారు. గురువారంతో శ్రావణమాసం ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. చిరుజల్లులు కురుస్తున్నా భక్తులు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బద్ధి పోచమ్మ ఆలయంలోనూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
     
>
మరిన్ని వార్తలు