రజకులు అన్ని రంగాల్లో రాణించాలి

2 Oct, 2016 23:40 IST|Sakshi

అనంతపురం కల్చరల్‌: రజకులు కాలంతో పోటీపడి అన్ని రంగాల్లోనూ రా ణించాలని రజక వధూవర వేదిక నిర్వాహకులు కమ్మన్న ఆకాంక్షించారు. ఆదివారం స్థానిక లిటిల్‌ఫ్లవర్‌ పాఠశాలలో రజక వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కమ్మన్న, చంద్రశేఖర్‌ తదితరులు మాట్లాడారు.

సంబంధాలు కుదుర్చుకోవడం కష్టంగా మారిన ఈ బీజీ రోజుల్లో ఇలాంటి వేదికలు అందరికీ ప్రయోజనకారిగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు అనిల్, పార్వతమ్మ, ఎ ర్రిస్వామి,రంగనాథ్, లింగమయ్య, కృష్ణమూర్తి, బయన్న  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు