ముగిసిన రాట్నాలమ్మ తిరునాళ్లు

16 Apr, 2017 00:31 IST|Sakshi
ముగిసిన రాట్నాలమ్మ తిరునాళ్లు
రాట్నాలకుంట (పెదవేగి రూరల్‌): కన్నుల పండువగా రాట్నాలమ్మతల్లి తిరునాళ్లు శనివారంతో ముగిశాయి. తిరునాళ్ల చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్‌ సీహెచ్‌ ప్రభాకర్‌   పాల్గొన్నారు.  ఉత్సవ మూర్తికి అవబృతోత్సవం, కుంభాభిషేకం, పుష్పయాగోత్సవం విజయవాడకు చెందిన మండలి హనుమంతరావు, పద్మ దంపతులు నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు ఉదయం 9 గంటల నుంచి అన్నసమారాధన, రాత్రి 7 గంటలకు వృక్ష కల్యాణం, కూచిపూడి నృత్య ప్రదర్శన,  తెప్పోత్సవం భక్తులను అలరించాయి. రాత్రి 9 గంటలకు సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు.
 
 
 
 
మరిన్ని వార్తలు