టీఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా రవీంద్రనాయక్‌

16 Mar, 2017 00:05 IST|Sakshi

అనంతపురం రూరల్‌ : గిరిజన విద్యార్థి ఫెడరేషన్‌(టీఎస్‌ఎఫ్‌) జిల్లా అధ్యక్షుడిగా ఆర్‌. రవీంద్రనాయక్‌ను ఎంపిక చేశారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి అక్కులప్ప నాయక్‌ జిల్లా కమిటీని ప్రకటించారు. కార్యదర్శిగా సుంకన్న, ఉపాధ్యక్షుఽలుగా గోపాల్‌నాయక్, హరి, హనుమంతునాయక్,  సహాయ కార్యదర్శిగా రఘునాథ్‌ నాయక్, కోశాధికారిగా లోకేష్‌ నాయక్‌లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు.

మరిన్ని వార్తలు