40 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

18 Feb, 2017 07:38 IST|Sakshi

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని జీవకోన శేషాచలం అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూంబింగ్‌ నిర‍్వహించారు. ఈ సందర‍్భంగా వారికి 20 మంది తమిళ కూలీలు తారసపడ్డారు. వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా 19 మంది పారిపోయారు. ఈ సందర‍్బంగా తరలించేందుకు సిద‍్ధంగా ఉంచిన 40 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


 

మరిన్ని వార్తలు