-

26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

29 Jul, 2016 00:26 IST|Sakshi
26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

రైల్వేకోడూరు రూరల్‌:

ప్రత్యేక బలగాల కూంబింగ్‌లో భాగంగా గురువారం సాయంత్రం రైల్వేకోడూరు మండలంలోని వాగేటికోన వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా రవాణాకు సిద్ధంగా ఉంచిన సుమారు 26 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చే సుకున్నట్లు తెలిసింది. వీటిని ఓ ట్రాక్టర్‌లో కోడూరుకు తీసుకొచ్చారు. అయితే  ఈ సంఘటనపై పోలీసులు ఎలాంటి వివరాలు తెలపలేదు. ఈ విషయమై రాజంపేట డీఎస్పీ రాజేంద్రను వివరణ కోరగా ఆయన ఎలాంటి సమాధానం చెప్పలేదు.

మరిన్ని వార్తలు