చిత్తూరులో 30 మంది తమిళ కూలీలు అరెస్ట్

18 Aug, 2015 08:51 IST|Sakshi

చిత్తూరు : చిత్తూరు బైపాస్ రోడ్డులో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు నుంచి తిరుపతి వస్తున్న 30 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే వారికి చెందిన రెండు వాహనాలను సీజ్ చేశారు. లారీలలోని రూ. కోటి విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని అటవీశాఖ అధికారులకు అందజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు