ప్రాంతీయ పార్టీలదే హవా: దేవెగౌడ

29 May, 2016 09:34 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోందని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. శనివారం విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ కార్యక్రమం అనంతరం మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైందన్నారు.

భవిష్యత్‌లో ప్రాంతీయ పార్టీలే దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఆ కూటమికి ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల్లో దేశ ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు.
 

మరిన్ని వార్తలు