కోట్ల బ్యారేజి గేట్లకు మరమ్మతులు

10 Jul, 2017 23:51 IST|Sakshi
కోట్ల బ్యారేజి గేట్లకు మరమ్మతులు
కర్నూలు(సిటీ) : మండల పరిధిలోని సుంకేసుల వద్ద తుంగభద్రనదిపై నిర్మించిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బ్యారేజి గేట్ల మరమ్మతులు సోమవారం ప్రారంభమయ్యాయి. క్రస్ట్‌ గేట్లకు రంగులు వేయడం, రోప్స్, రబ్బర్‌ సీల్స్, వాక్‌ వే నిర్మాణం తదితర వాటి కోసం నీరు-చెట్టు కింద రూ.8 కోట్లతో టెండర్లు పిలువగా స్వప్న కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పనులను దక్కించుకుంది. ఇటీవలే ఏజెన్సీతో కేసీ కాలువ ఇంజనీర్లు అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం బ్యారేజికి రంగులు వేసే పనులను డీఈఈ జవహర్‌రెడ్డి, ఏఈఈ శ్రీనివాసరెడ్డి పూజ చేసి ప్రారంభించారు. 
 
మరిన్ని వార్తలు