మంత్రికి వినతుల వెల్లువ

22 Sep, 2016 00:23 IST|Sakshi

అనంతపురం న్యూటౌన్‌ :  జిల్లా పర్యటనలో ఉన్న బీసీ సంక్షేమ శాఖా మంత్రి కొల్లు రవీంద్రకు బీసీ సంఘాల నేతలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. అన్ని జిల్లాలలో బీసీ భవన్లు ఏర్పాటు చేయాలని,  జనాభా దామాషా  ప్రకారం బీసీ కార్పోరేషన్‌కు రూ.20 కోట్లు కేటాయించాలని,  చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కేటాయించాలని, ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో బీసీలకు మినహాయింపు ఇవ్వాలని డిమాండు చేశారు. 

మరిన్ని వార్తలు