కదిలించిన ‘సాక్షి’ ఫొటో

19 Aug, 2016 00:31 IST|Sakshi
కదిలించిన ‘సాక్షి’ ఫొటో
– వికలాంగునికి చేయూతనిచ్చిన కానిస్టేబుల్‌కు అవార్డు
– రూ.5,016 రివార్డు ప్రకటించిన డీజీపీ
 
శ్రీశైలం: కృష్ణా పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లా శ్రీశైలంలోని లింగాలగట్టు పుష్కర ఘాట్‌లో ఓ దివ్యాంగుడిని కానిస్టేబుల్‌ తన చేతులతో ఎత్తుకొని ఒడ్డుకు చేరుస్తున్న ఫొటోను గురువారం ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది. ఈ దశ్యం డీజీపీ సాంబశివరావును కదిలించింది. కానిస్టేబుల్‌ సేవలను ప్రశంసిస్తూ గురువారం ఆయన రివార్డు ప్రకటించారు. డీజీపీ ఆదేశాల మేరకు రాయలసీమ జిల్లాల ఐజీ శ్రీధర్‌రావు, డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకెరవికష్ణ, ఆత్మకూరు డీఎస్పీ సుప్రజలు గురువారం ఉదయం స్వయంగా లింగాలగట్టు దిగువ ఘాటుకు చేరుకొని పుష్కర విధుల్లోని కానిస్టేబుల్‌ మధుకుమార్‌ను అభినందించి రూ.5,016 నగదు రివార్డును అందజేశారు. మధుకుమార్‌(పీసీ 229) కోసిగి మండల పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్నారు. గతంలో మంత్రాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనూ ఈయన అవార్డును అందుకోవడం విశేషం.
 
>
మరిన్ని వార్తలు