దళితుల సమస్యలపై పోరాటం

17 Jul, 2016 19:44 IST|Sakshi
మాట్లాడుతున్న కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నాగయ్య
  • దళిత ఆత్మగౌరవ ఉద్యమం
  • కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.నాగయ్య
  • కరీంనగర్‌ : దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు ‘దళిత ఆత్మగౌరవ ఉద్యమం’ చేపడుతున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.నాగయ్య తెలిపారు. భగత్‌నగర్‌లోని మెడికల్‌ రిప్స్‌ భవనంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇంకా దళితులను అస్ప­ృశ్యత, అంటరానితనం వెంటాడుతుందన్నారు. దళిత వాడలో అభివృద్ధి చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌ రుణాల మంజూరులో జాప్యమవుతుందన్నారు.
    ప్రజాసాంస్క­ృతిక వేదిక రాష్ట్ర కన్వీనర్‌ జి.రాములు మాట్లాడుతూ ప్రజలను ప్రజాసాంస్కృతిక విప్లవం వైపు మళ్లించాలన్నారు.  కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి టి.సురేష్, అధ్యక్షుడు కె.అశోక్, ఉపాధ్యక్షులు మర్రి వెంకటస్వామి, సంపత్, నరేందర్, కృష్ణ, నాయకులు కరుణాకర్, జిట్టు లింగామూర్తి పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు