రైఫిల్‌ షూటింగ్‌లో జిల్లాకు రజత పతకం

26 Jul, 2016 22:48 IST|Sakshi
ఏలూరు రూరల్‌ : రాష్ట్రస్థాయి అండర్‌–19 రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో ఏలూరుకు చెందిన గాడి నీరజ రజత పతకం సాధించింది. ఈ విషయాన్ని రాష్ట్ర రైఫిల్‌ షూటింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సుబ్రహ్మణ్యం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీన గుంటూరులో నిర్వహించిన పోటీల్లో నీరజ ప్రతిభ చూపినట్టు చెప్పారు. భవిష్యత్తులో రైఫిల్‌ షూటింగ్‌కు ఆదరణ పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
>
మరిన్ని వార్తలు