నెక్లెస్‌రోడ్‌లో రియోత్సాహం..

18 Sep, 2016 22:50 IST|Sakshi
నెక్లెస్‌రోడ్‌లో రియోత్సాహం..

ఖైరతాబాద్‌: రియో ఒలంపిక్స్‌ పారా అథ్లెటిక్స్‌లో భారత్‌ క్రీడాకారుల విజయాల్ని స్వాగతిస్తూ ఆదివారం నెక్లెస్‌రోడ్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ‘ఏపీ డిఫరెంట్లీ ఏబుల్డ్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్   అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పీపుల్స్‌ ప్లాజా నుంచి ఏపీ సచివాలయం వరకు సాగిన ఈ ర్యాలీని బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ప్రారంభించారు. సంఘం చైర్మన్‌ కోటేశ్వరరావు, జాతీయ పారా క్రీడాకారులు శ్రీనివాసులు, అంజన్ రెడ్డి   పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు