‘పర్యవేక్షణ విషయంలో రాజీ లేదు’

27 Sep, 2016 23:21 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ : తాను ఏ క్యాడర్‌లో ఉన్నా పర్యవేక్షణ విషయంలో రాజీ ప్రసక్తే లేదని ఇంటర్‌ విద్య ఆర్జేడీ వెంకటరమణ అన్నారు. లేపాక్షి జూనియర్‌ కళౠశాల ప్రిన్సిపల్‌గా ఉంటున్న ఆయనకు జిల్లా వత్తి విద్యాశాఖ అధికారిగా, రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో పర్యవేక్షణ ఇబ్బందిగా మారుతోందంటూ ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఆయన మంగళవారం స్పందించారు. తాను ఎంత బిజీగా ఉన్న వారానికోసారి కళాశాలకు వెళ్తున్నానని, ఇన్‌చార్జ్‌తో తరచూ సమన్వయం చేసుకుంటూ కళాశాలను ఆదర్శంగా నిలిపేలా ప్రయత్నిస్తున్నట్లు వివరణ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు