రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

16 Aug, 2016 01:04 IST|Sakshi
మృతిచెందిన హరిప్రసాద్‌ను పరీక్షిస్తున్న వైద్యులు
 
ఆత్మకూర్‌ : పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించేందుకు స్నేహితుడితో కలిసి బయలుదేరిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై మార్గమధ్యంలోనే మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన హరిప్రసాద్‌ (21), రఘు ఆదివారం ఉదయం నందిమల్ల డ్యాంలో పుష్కర స్నానం చేసేందుకుగాను బైక్‌పై బయలుదేరారు. ఆత్మకూర్‌ పరమేశ్వరస్వామి చెరువుకట్టపైకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన  చుట్టుపక్కలవారు వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే హరిప్రసాద్‌ మతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రఘుకు మెరుగైన వైద్యంకోసం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ సీహెచ్‌ రాజు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
 
మరిన్ని వార్తలు