కారు బోల్తా : ప్రయాణికులు క్షేమం

14 Sep, 2016 12:18 IST|Sakshi

ఖమ్మం: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కొమ్ముగూడెం వద్ద ఖమ్మం - ఇల్లందు ప్రధాన రహదారిపై బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ఉన్న గేదెను తప్పించబోయి కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులోని డ్రైవర్‌తోపాటు ప్రయాణికులు స్వల్పంగా గాయాపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు