నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

24 Feb, 2017 08:06 IST|Sakshi
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నకిరేకల్‌(నల్లగొండ): నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న కెమికల్‌ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి.

వివారాలు.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన జిల్లాలోని నకిరేకల్‌ మండలం ఐటిపాముల సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. క్షతగాత్రులు నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


 

మరిన్ని వార్తలు