చీరాల(ప్రకాశం): కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ సంఘటన ప్రకాశం జిల్లా చీరాల సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గుర్తించిన వాహనదారులు అంబులెన్స్ల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.