గోదావరిఖనిలో చోరీ

31 Jul, 2016 13:06 IST|Sakshi

గోదావరిఖని (కరీంనగర్) : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన కరీనంగర్ జిల్లా గోదావరిఖనిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక 5వ ఇంక్లైన్ కాలనీలోని ఓ ఇంట్లో నిన్న రాత్రి దొంగలు పడి 15 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ. 70 వేల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు