పిడుగురాళ్లలో భారీ చోరీ

11 Sep, 2016 10:38 IST|Sakshi

పిడుగురాళ్ల (గుంటూరు) : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి దోచుకెళ్లారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో శనివారం రాత్రి దొంగలు పడి రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు, రూ. 40 వేల విలువైన ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సాయంతో వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు