ప్రొద్దుటూరులో భారీ చోరీ

8 Aug, 2015 11:06 IST|Sakshi

ప్రొద్దుటూరు : ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లివచ్చేసరికి దొంగలు పడి ఇంట్లో ఉన్న సొమ్మును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులోని టీచర్స్‌కాలనీలో శుక్రవారం అర్థరాత్రి జరిగింది. కాలనీకి చెందిన టి.ఆర్ మణి పట్టణంలో గ్యారేజ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం బంధువుల ఇంట్లో పెళ్లి ఉండటంతో బెంగళూరు వెళ్లిన మణి శనివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు.

ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో మణి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు.  12 తులాల బంగారం, కిలో వెండి, రూ. 1.45 లక్షల నగదు దొంగలు అపహరించారని మణి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
 

మరిన్ని వార్తలు