రోడ్డు తవ్వకాల్లో బయటపడిన శిలాశాశనం

28 Dec, 2016 00:16 IST|Sakshi
రోడ్డు తవ్వకాల్లో బయటపడిన శిలాశాశనం

పెద్దవడుగూరు(తాడిపత్రి): పెద్దవడుగూరు మండలం తెలికి రోడ్డులో మంగళవారం ఉదయం బయటపడింది. పైప్‌లైన్‌ నిర్మాణం కోసం పైప్‌లైన్‌ కోసం జేసీబీ సహాయంతో మట్టిని తవ్వుతుండగా శిలాశాసనం కనిపించింది. దానిపై అక్షరాలు, బొమ్మలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అశోకుని చిహ్నాలుగా పోలి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయం ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.  అయినా అధికారులెవరూ అటువైపు చూడకపోవడంతో బయటపడిన శిలాశాశానాన్ని స్థానికులు అక్కడే వదిలేశారు. 

మరిన్ని వార్తలు