విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య

29 Oct, 2015 08:15 IST|Sakshi

విశాఖపట్టణం: విశాఖ నగరంలో బుధవారం అర్థరాత్రి ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. మల్కాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామకృష్ణాపురంనాడి రోడ్డులో రౌడీ షీటర్ పట్నాల సంతోష్‌కుమార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు.

ఇప్పటికే సంతోష్ పలు కేసుల్లో నిందుతుడిగా ఉన్నాడు. వ్యక్తి గత కక్షలే ఈ హత్యకు పురిగొల్పి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు