మంత్రాలయం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం హుండీ ఆదాయం జనవరి నెలకు సంబంధించి రూ. 1.50 కోట్లు వచ్చినట్లు శ్రీ మఠం మేనేజర్ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. భక్తులు రాఘవేంద్రస్వామికి కానుకలు, ముడుపుల రూపంలో రూ.1.50 కోట్లతో పాటు 76 గ్రాములు బంగారం, 650 గ్రాములు వెండి, 2764 విదేశి డాలర్లు సమర్పించినటు్ల పేర్కొన్నారు.