పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీసులు రూ.లక్ష విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం స్థానికంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ వాహనంలో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. వీటిని ఒడిశా నుంచి నర్సన్నపేటకు తీసుకువస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.