కోసిగి: తాగునీటి సీపీడబ్ల్యూ స్కీమ్ మెయింటెనెన్స్ కోసం జిల్లాకు రూ.16కోట్లు మంజూరైనట్లు జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ తెలిపారు. బుధవారం కోసిగి మండలంలోని చింతకుంట, పల్లెపాడు, మూగలదొడ్డి, చిర్తనకల్లు, సాతనూరు, తుంబిగనూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. కోసిగిలోని రంగప్ప గట్టు వద్ద విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో లోవోల్టేజ్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాభివృద్ధి కోసం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయు పోస్టులు భర్తీకి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి, మండల అధ్యక్షుడు పెండ్యాల ఆదినారాయణ శెట్టి, కోసిగి సర్పంచ్ ముత్తురెడ్డి తదితరులు పాల్గొన్నారు.