పోలేరమ్మ జాతర ఆదాయం రూ.9.58లక్షలు

24 Sep, 2016 01:47 IST|Sakshi
పోలేరమ్మ జాతర ఆదాయం రూ.9.58లక్షలు
వెంకటగిరి: వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మకు జాతర ద్వారా రూ.9.58 లక్షల రాబడి వచ్చింది. గత ఏడాది జాతర హుండీ ద్వారా 7.34 లక్షలు ఆదాయం రాగా ఈ ఏడాది రూ.9.41 లక్షల రాబడి వచ్చింది. గత ఏడాది టికెట్‌ల ద్వారా రూ.4.47 లక్షల రాబడి రాగా ఈ ఏడాది రూ.200 టికెట్ల అమ్మకం ద్వారా రూ.6.41 లక్షలు, రూ.100 టికెట్ల ద్వారా రూ.5.67 లక్షల ఆదాయం వచ్చినట్లు  ఆలయ ఈఓ వై రామచంద్రరావు తెలిపారు. ఈ ఏడాది వీఐపీ పాస్‌ల రద్దుతో ఆదాయం గణనీయంగా పెరిగిందని ఈఓ వివరించారు. 
మరిన్ని వార్తలు