కాల్‌ చేశారు: లక్ష కొట్టేశారు

4 Aug, 2015 18:32 IST|Sakshi

కరీంనగర్: ఏటీఎం కార్డు కాలపరిమితి ముగిసిపోయింది. కార్డుకు సంబంధించి పూర్తి వివరాలు తెలపండని ఫోన్ చేసి అకౌంట్‌లోని డబ్బులు కాజేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా పెదపల్లి ఐటీఐ కాలేజీలో మంగళవారం వెలుగుచూసింది. పెదపల్లి ఐటీఐ కాలేజీలో పనిచేసే నందగోపాల్‌కు దుండగులు ఫోన్‌ చేసి కార్డు వివరాలు తీసుకుని అతడి అకౌంటు నుంచి రూ. 66 వేలు కాజేశారు.  అనంతరం మరో సారి కాల్ చేసి నగదు తప్పుగా జమ అయ్యాయని మరో కార్డు వివరాలు చెబితే అందులోకి బదిలీ చేస్తామని నమ్మబలికారు. ఇలా నలుగురి వివరాలు తీసుకుని రూ. లక్ష పై చిలుకు దొచుకున్నారు.

మరిన్ని వార్తలు