వినాయకచవితి మండపాలను నిర్వాహకులు పోటీ పడి లక్షల రూపాయల నగదుతో అలంకరిస్తున్నారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని మండపాన్ని రూ.27 లక్షల నగదుతో అలంకరించారు. పెదనందిపాడు మండలం కట్రపాడులోని పట్టాభిరామ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని రూ.10 లక్షల నగదుతో అలంకరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మేకతోటి సుచరిత బుధవారం రాత్రి గణనాథుడిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. – పెదనందిపాడు/ మంగళగిరి