ఆర్టీసీ డిప్యూటీ సీటీఎంగా కిషోర్‌

17 Nov, 2016 23:20 IST|Sakshi

కడప అర్బన్‌ : ఏపీఎస్‌ఆర్టీసీ డిప్యూటీ సీటీఎంగా ఆర్‌ఆర్‌ కిషోర్‌ గురువారం సాయంత్రం ఆర్‌ఎం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. 1992లో చిత్తూరులో డిపో మేనేజర్‌గా బాధ్యతలను చేపట్టిన ఈయన తర్వాత అనంతపురం, కడప రీజినల్‌లో పని చేశారు. 2006లో పదోన్నతి పొందారు. హైదరాబాద్‌లో పనిచేస్తూ, రాష్ట్ర విభజనలో విజయవాడకు వచ్చి అక్కడ విధులు నిర్వహించారు. ప్రస్తుతం డిప్యూటీ సీటీఎం హోదాలో జిల్లాకు బదిలీ ఆయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ వంతు ప్రయాణికులకు సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు