భక్తితో మెలిగితేనే శబరియాత్రకు సార్థకత

23 Jul, 2016 17:49 IST|Sakshi
భక్తితో మెలిగితేనే శబరియాత్రకు సార్థకత

కందుకూరు: కులాలకు అతీతంగా అయ్యప్ప మాలధరించిన ప్రతిఒక్కరిని అక్కున చేర్చుకుని భక్తిభావంతో మెలిగినప్పుడే శబరియాత్రకు సార్థకత ఏర్పడుతుందని శబరిమల అయ్యప్ప సేవా సమాజం ఆల్‌ ఇండియా టస్ట్‌ సభ్యుడు ఐత రాములు, తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు ధనుంజయగుప్తా, కార్య నిర్వాహక కార్యదర్శి నాయిని బుచ్చిరెడ్డి తెలిపారు. శనివారం మండల కేంద్రంలో టంకరి రాంరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో శబరిమల అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం గురుస్వాములతో కూడిన కందుకూరు మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హైందవ ధర్మాన్ని కాపాడేలా ప్రతి అయ్యప్ప భక్తుడు మెలగాలని సూచిం‍చారు. శబరిమలలో నాలుగేళ్లుగా అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీక్షా సమయంతో పాటు మిగతా సమయాల్లో కూడా సేవా భావంతో సమాజ సేవకు పాటుపడాలన్నారు.

మరిన్ని వార్తలు