-

సాక్షరభారత్‌ కేంద్రాలకు కొత్త ఫర్నిచర్‌

12 Sep, 2016 23:30 IST|Sakshi
నర్వ : మండల పరిధిలోని గ్రామాల్లో కొనసాగుతున్న సాక్షరభారత్‌ కేంద్రాలకు ప్రభుత్వం నుంచి నూతన ఫర్నిచర్‌ మంజూరైందని ఎంపీడీఓ రాఘవ తెలిపారు. సోమవారం మండల కేంద్రానికి చేరుకున్న ఫర్నీచర్‌ను మండల మహిళా సమాఖ్య భవనంలో భద్ర పరిచారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఒక్కో సాక్షరభారత్‌ కేంద్రానికి ఒక్క కుర్చీ, ఒక్క టేబుల్, బ్లాక్‌ బోర్డు, సాక్షరభారత్‌ కేంద్రానికి సంబంధించిన సూచికబోర్డులు వచ్చాయన్నారు. వీటితో పాటు టార్చిలైటును కూడా అందిస్తున్నామన్నారు. వయోజనులకు విద్యనందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సాక్షరభారత్‌ కేంద్రాలకు నిధులు మంజూరుచేసి అవసరమైన ఫర్నిచర్‌ను ఇస్తున్నామన్నారు. ఫర్నిచర్‌ సాక్షరభారత్‌ కేంద్రాలలో లేదా గ్రామపంచాయతీ ఆధీనంలో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎంపీడీఓ వెంట సాక్షరభారత్‌ మండల కోఆర్డినేటర్‌ అనురాధ ఉన్నారు. 
 
మరిన్ని వార్తలు