కర్నూలు(కల్చరల్): రాష్ట్రస్థాయి ఫొటో జర్నలిస్టుల కాంపిటీషన్ 2015–16 సంవత్సరానికి కృష్ణా పుష్కరాల కేటగిరీలో కర్నూలుకు చెందిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ డి.హుస్సేన్ ఉత్తమ ఫొటోగ్రాఫర్గా ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా శ్రీశైలం లింగాలగట్టు ఘాట్లో ఓ కానిస్టేబుల్ మానవతా దృక్పథంతో వికలాంగుడైన భక్తుడిని స్నానానికి మోసుకెళ్తున్న దశ్యాన్ని హుసేన్ తన కెమెరాలో బంధించారు. మానవీయ కోణంలో చూపరులను ఆకట్టుకున్న ఈ ఫొటో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఛాయాచిత్రంగా ఎంపికైనట్లు రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ బుధవారం ప్రకటించారు. గతంలోనూ హుసేన్కు 2002లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డు దక్కింది. 2004లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి చేతుల మీదుగా, 2006లో అప్పటి సమాచార శాఖ మంత్రి గీతారెడ్డి చేతుల మీదుగా, 2013లో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రమణ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్గా అవార్డు అందుకున్నారు. 2015–16 సంవత్సరానికి నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటో జర్నలిస్టుల పోటీలలో హుసేన్ ఉత్తమ ఫొటోగ్రాఫర్గా ఎంపికవడం పట్ల ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు కె.బి.శ్రీనివాసులు, ఏపీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అంబన్న, జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపవరం హర్షం ప్రకటించారు. త్వరలో విజయవాడలో జరుగనున్న అవార్డు ప్రదానోత్సవంలో హుసేన్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.