వైభవంగా సరస్వతీ యాగం

4 Nov, 2016 22:36 IST|Sakshi
వైభవంగా సరస్వతీ యాగం

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కార్తీకమాస శుద్ధ పంచమి శుక్రవారం, అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కలిసిరావడంతో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సరస్వతీ యాగం నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయానికి సమీపంలోని యాగశాలలో నిర్వహించిన ఈ యాగానికి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య, షణ్ముఖ శాస్త్రి పర్యవేక్షణలో యగం నిర్వహించారు. విద్యార్థులకు అమ్మవారి ప్రసాదంగా పెన్ను, పుస్తకం, దుర్గమ్మ కంకణం, ప్రసాదాన్ని అందజేశారు. సుమారు 500 మంది విద్యార్థులు వచ్చారు. ఇకపై ప్రతినెలా మూలానక్షత్రం రోజున సరస్వతీ యాగం జరిపించాలని ఆలయ ఈవో సూర్యకుమారి నిర్ణయించినట్లు వైదిక కమిటీ సభ్యులు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు