చీరల దొంగల ముఠా అరెస్ట్

22 Aug, 2015 11:21 IST|Sakshi

నల్లగొండ : తరుచూ చీరల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు మహిళలు, ఒక ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శనివారం నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలో వెలుగు చూసింది. వివరాలు.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలానికి చెందిన ఐదుగురు మహిళలు ముఠాగా ఏర్పడి చీరల దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరికి ఒక ఆటో డ్రైవర్ సహాయ పడుతున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్లో భూదాన్పోచంపల్లి మండలంలోని భవాని హ్యాండ్లుమ్స్ దుకాణంలో రూ. 80 వేల విలువైన చీరలను దోచుకుని... పరారైయ్యారు.

ఇది గుర్తించిన సదరు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, తాజాగా వీరు మండలంలోని కొత్తగూడెం గ్రామ సమీపంలో పోలీసుల తనిఖీలో పట్టుబడ్డారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి... భువనగిరికోర్టులో హజరుపరిచారు.  చీరలను దోచుకెళ్లి తిరిగి విక్రయించి సొమ్ము చేసుకోవడం వీరిపని అని పోలీసులు తెలిపారు. ఆటోను కూడా సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు