మాజీ ఎమ్మెల్యే సత్యలింగనాయకర్ కన్నుమూత

20 Jan, 2016 09:18 IST|Sakshi

కాకినాడ : మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు సత్యలింగనాయకర్ మంగళవారం ఆర్థరాత్రి మరణించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కోరంగిలో ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా పని చేశారు.

అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పని చేశారు. గత కొంత కాలంగా సత్యలింగనాయకర్ అనారోగ్యంతో ఉన్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన అంత్యక్రియలు గురువారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు