ఇబ్రహీంపట్నం : తల్లిదండ్రుల చదువుకోవాలని చెప్పినందుకు మండలంలోని యామాపూర్కు చెందిన విద్యార్థిని స్వరూప(16) క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుందని హెడ్ కానిస్టేబుల్ చిలుక శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. స్వరూప 8వ తరగతి వరకు చదివింది. ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటోంది. తల్లిదండ్రులు కాస లక్ష్మి–రాజేందర్ స్కూల్కు Ðð ళ్లాలని బుధవారం మందలించారు. చదువు ఇష్టంలేక స్వరూప ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మెట్పల్లి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. తండ్రి రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.