ఎస్సీ, ఎస్టీ హెచ్‌ఎంల సంఘం నూతన కమిటీ ఎన్నిక

12 Dec, 2016 00:04 IST|Sakshi
అనంతపురం :  స్థానిక ఉపాధ్యాయ భవ¯Œన్లో ఆదివారం ఎస్సీ, ఎస్టీ ప్రధానోపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.  కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ యామినీబాల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు  ఐక్యంగా పోరాడి హక్కులను సా«ధించుకోవాలన్నారు. బెళుగుప్ప ఎంఈ ఓ ఎ¯ŒS.దేవవరం అధ్యక్షత వహించారు.  బంజారా సంఘం సీనియర్‌ నాయకులు ఎస్‌.కె.కేశవ నాయక్, ఎస్టీయూ అధ్యక్షుడు జె.రామన్న, ఆర్ట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎ¯ŒS.రంగస్వామి, ఎంఈఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు శంకర్, బామ్సెఫ్‌ నేత రవిశంకర్, ఎస్సీ, ఎస్టీ ఉపాధాయయ సంఘం అధ్యక్షులు ఎస్‌.పెద్దన్న పాల్గొన్నారు. 
 
నూతన కార్యవర్గం : సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎ¯ŒS.దేవవరం, ప్రధాన కార్యదర్శిగా టి.వెంకటరమణ నాయక్, గౌరవాధ్యక్షుడిగా ఎం.కృష్ణయ్యను ఎన్నుకున్నారు. కోశాధికారిగా హెచ్‌.గురుప్రసాద్, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎం.సాయిప్రసాద్, ఇ.చంద్రశేఖర్, పి.మల్లికార్జున, కార్యనిర్వాహక కార్యదర్శిగా సుధాకర్‌ నాయక్, కార్యాలయ కార్యదర్శిగా డి.హరికృష్ణ, కేంద్ర కార్యదర్శిగా టి.సుబ్రహ్మణ్యం, మహిâýæ ప్రతినిధులుగా బి.విజయకుమారి, ఎస్‌.లలిత, ఎస్‌.శాంతాబాయి, కె.అరుణమ్మలను ఎన్నుకున్నారు. వీరితోపాటు నలుగురు సహా అధ్యక్షులు, నలుగురు సహ కార్యదర్శులు, నలుగురు ఆడిట్‌ సభ్యులను ఎన్నిక చేశారు.  
>
మరిన్ని వార్తలు