శ్రీకాకుళం ఏజెన్సీలో ఘరానా మోసం

2 Jul, 2016 14:32 IST|Sakshi

శ్రీకాకుళం: రైస్ పుల్లింగ్, కాపర్ కాయిల్ పేరుతో శ్రికాకుళం ఏజెన్సీలో రూ. 50 లక్షలు కొల్లగొట్టిన వారిపై కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రికి చెందిన వ్యక్తులంగా నిందితులు చెప్పుకోవటంతో పోలీసులు వారిపై కేసునమోదు చేయడంలేదని సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఓ ఎస్సై పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దోనుబాయి ప్రాంతంలో ఏజెంట్ నెట్వర్క్ ముసుగులో మాయగాళ్లు గిరిజనులకు మస్కా కొట్టారు.  అయితే సొమ్ము రికవరీకి పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. పోలీసుల అదుపులో విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన ముగ్గురు నిందితులు ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు